ఒంటి కాలిపై నిలబడి మున్సిపల్ కార్మికుల నిరసన

Jan 2,2024 16:10 #Dharna, #Kakinada, #muncipal workers

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ):తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 8 వ రోజుకు చేరుకుంది.మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేష బాబ్జి మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సమాన పనికి సమాన వేతనం ఇస్తానని మున్సిపల్ కార్మికులకు హామీ ఇచ్చారన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని అమలు చేయటం లేదన్నారు.తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే పోటీ కార్మికులను రంగంలోకి దింపి కార్మికుల మధ్య వివాదాలు రగిలించటం అన్యాయమన్నారు.పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకోటి అప్పారావు, వర్రే గిరిబాబు,భూపతి శ్రీను, మడికి కృష్ణ, చేపల అర్జియ్య,వర్రె రాజేష్, ముత్యాల దుర్గ,వర్రె కుమారి,పెడారి గంగాభవాని,వెంకటలక్ష్మి,సత్యవతి,వర్రె నాగదేవి,మడికి మోహన్ రావు,దోనం దేవ ప్రసాద్,దొండపాటి సురేష్,దొండపాటి శేఖర్,ఆర్ సురేష్,శ్రీకాంత్,వర్రె రమణ,పలివెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️