టిడిపిలో సమాజ్‌ వాది పార్టీ నాయకురాలు

ప్రజాశక్తి-గిద్దలూరు గిద్దలూరు పట్టణంలో ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌ రెడ్డిల సమక్షంలో సమాజ్‌ వాది పార్టీ మహిళా నాయకురాలు అడపాల నాగమణి, గిద్దలూరు నియోజకవర్గంలో స్థానిక నాయకుడైన అశోక్‌ రెడ్డి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని మద్దతు తెలియజేస్తూ 50 కుటుంబాలతో సహా తెలుగుదేశం పార్టీలో చేరారు. గిద్దలూరు అసెంబ్లీకీ సమాజ్‌ వాది పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన నాగమణి ఏప్రిల్‌ 29వ తేదీ తాను వేసిన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకొని, మంగళవారం ఉదయం మాగుంట, ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టిడిపి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

➡️