విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు
కదిరి టౌన్: తమ స్వార్థ ప్రయోజనాలు కోసం ఇన్నిరోజులు వైసిపి బీజేపీతో అంటకాగింది వాస్తం కాదా అని టీడీపీ మైనార్టీ నాయకులు బహువుద్దిన్, అక్రమ్ తదితరులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ను ప్రశ్నించారు. శుక్రవారం పట్టణంలోని ఆకాష్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మైనార్టీలను అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీల తడాఖా ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం కుల మతాలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్ రెచ్చగొడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. కేసులు కోసం మోడీకి తొత్తులుగా వైసీపీ మారిందన్న విషయం ఆపార్టీ గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కదిరిలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ను అఖండ మెజారితో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు ఆల్ఫా ముస్తఫా, మహబూబ్ బాషా, టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్,మాజీ కౌన్సిలర్ అయూబ్. కటిక ఖాదర్ భాషా, టీడీపీ మహిళా నాయకురాలు పర్వీన్ భాను తదితరులు పాల్గొన్నారు.