వైసిపి ఎన్నికల ప్రచారం

May 10,2024 22:07

 పార్టీలోకి చేరిన వారితో దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

                       బుక్కపట్నం : వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్‌ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు. తిరిగి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు దక్కాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌ రెడ్డి, వైసీపీ సీనియర్‌ నాయకులు రాజంరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సర్పంచి నాగలక్ష్మి రాజు, గోవర్ధన్‌ రెడ్డి, పతాంజలితో పాటు పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.పుట్టపర్తి క్రైమ్‌ : టిడిపి నుంచి పలువురు నాయకులు వైసీపీలో చేరారు. శుక్రవారం వైసిపి స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు. నల్లమాడ మండలం పాత బత్తలపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీలో చేరారు. అలాగే నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి చెందిన వారు టిడిపి నుంచి సొంతగూటికి వైసీపీలో చేరారు. వారి అందరిని కూడా కండువాలు వేసి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.

➡️