విద్యార్థులు అంకిత భావంతో చదవాలి

Jun 17,2024 20:03
విద్యార్థులు అంకిత భావంతో చదవాలి

ప్రోత్సాహక బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు
విద్యార్థులు అంకిత భావంతో చదవాలి
ప్రజాశక్తి-గుడ్లూరు : పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించడం కోసం కష్టపడిన విద్యార్థులు ఉన్నత చదువులు కోసం అంకితభావంతో చదవాల్సిన అవసరముందని గుడ్లూరు, బసిరెడ్డి పాలెం, రావూరు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టివి రామ్మోహన్రావు ,వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుడ్లూరు అభ్యుదయ పాఠశాలలో యశ్వంత్‌ సాయి తేజ మెమోరియల్‌ ట్రస్టు నిర్వాహకులు ఏర్పాటుచేసిన పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అభినందన సభలో సోమవారం ప్రసంగించారు. పదో తరగతి నుంచి కాలేజీలో చేరిన విద్యార్థులు పెడమార్గం పట్టకుండా అంకితభావంతో ఉన్నత చదువులు చదవాలన్నారు ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు యశ్వంత్‌ సాయి తేజ మెమోరియల్‌ ట్రస్టు నిర్వాహకులు అజరు కుమార్‌ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మండలంలో పదో తరగతిలో 580 మార్కులు సాధించిన గిరీష్‌ కుమార్‌కు 6000 ,576 మార్కులు సాధించిన భవ్యశ్రీ కి నాలుగు వేలు, 574 మార్కులు ప్రసాదిం చిన వేద వైష్ణవికి 3000 నగదు అందజేశారు. శ్రీ చైతన్య అభ్యుదయ స్కూలు ప్రిన్సిపాల్‌ దామా సోమా నాయుడు, కలగారెడ్డి, పదో తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️