ఆదరించండి… అభివృద్ధి చేస్తా: బిఎన్‌

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి బీఎన్‌ విజరు కుమార్‌ అన్నారు. శుక్రవారం సంతనూతలపాడులోని అంబేద్కర్‌ నగర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పారు. ముందుగా కాలనీలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికీ వెళ్లి టీడీపీ మ్యానిఫెస్టో పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణ ప్రసాద్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామినిబాల, మండల టీడీపీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, మాజీ సర్పంచ్‌ రంపతోటి అంకారావు, మాజీ జడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డు శంకర్‌, స్థానిక నాయకులు మార్పూడి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎనికపాడులో.. మండలంలోని ఎనికపాడు గ్రామంలో టీడీపీ అభ్యర్థి బీఎన్‌ విజరు కుమార్‌ సోదరుడు బొమ్మాజి అనిల్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ అన్న విజరు కుమార్‌ గత 15 సంవత్సరాలుగా గెలిచినా, ఓడినా ప్రజల మధ్యనే వున్నారని తెలిపారు. ప్రజల కోసం పని చేస్తున్న ఆయనకు మీరంతా అండగా వుండి ఆయన గెలుపునకు సంపూర్ణ మద్దతి వ్వాలని కోరారు. చర్చి ప్రహరీ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

➡️