మంగళగిరి రూరల్ (గుంటూరు) : కాజా పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల దొంగ పట్టుబడ్డాడు. శుక్రవారం పోలీసులు వివరాలను వెల్లడించారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగలు ఇప్పటివరకు 25 కు పైగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను పగలగొట్టి రాగి వైరులను దొంగలించి ఎవరికీ దొరక్కుండా ఈ దొంగలు సవాలు విసిరారని అన్నారు. రాగి వైర్లను దొంగలించి దొంగలు సొమ్ము చేసుకుంటున్నారు. ఎట్టకేలకు కాజా పంట పొలాల్లో దొంగతనానికి పాల్పడుతుండగా రైతులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో ఒకరుండగా, మరొకరు పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.