నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన ర్యాలీ, మానవహారం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి.రాము, సిహెచ్ వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్టిసి కాంప్లెక్స్ నుండి బాలాజీ జంక్షన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలాజీ జంక్షన్ వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ యూజీ 2024 ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రంలో ఏడుగురు విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, వారందరికీ 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయన్నారు. అదే సెంటర్లో ఎగ్జామ్ రాసిన జాన్వీ అనే విద్యార్థిని 179 ప్రశ్నలను అట్టెంప్ట్ చేయగా అందులో 163 కరెక్ట్ అయ్యాయని, ఆమెకు 636 మార్కులు రావాల్సి ఉండగా 720/720 ఎలా వచ్చాయంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నారు. ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు వచ్చాయని ప్రశ్నించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/sfi-2-1-300x173.jpg)