విజయపురిసౌత్ : నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం వద్ద జరిగిన 2568వ బుద్ధ జయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న టిబెటన్ బౌద్ధ భిక్షువులు (విజయపుసౌత్) అనుపు వద్దగల బౌద్ధ కట్టడాలను సందర్శించారు. ఈ విషయాన్ని బుద్ధవనం కన్సల్టెంట్ , ప్లీచ్ ఇండియా, సీఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు బుద్ధ వనంలో బుద్ధ జయంతి సందర్భంగా మహా యాన సాంప్రదాయ ప్రకారం బుద్ధ వందనం కార్యక్రమం నిర్వహించారు. మైసూరు సమీపంలోని బైలుకుప్పేలోని సెరా టిబెటన్ బౌద్ధారామానికి చెందిన గేషే నవాంగ్ జుంగె,జంపాకుంగ అనే బౌద్ధ భిక్షు వులకు, నాగార్జునకొండలో తిరుగాడిన ఆచార్య నాగార్జునడు, శ్రీ పర్వత విజయపురిలో విలసిల్లిన ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. 3వ శతాబ్దం) నాటి బౌద్ధ చరిత్ర, కట్టడాలు, శిల్పాలు, శాసనాలు, స్తూపాలు, చైత్యాలు, విహారాల గురించి శివనాగిరెడ్డి వివరించారు. బుద్ధునికి, ఆచార్య నాగార్జునకి, అనుపు బౌదా ్ధరామం వద్ద బౌద్ధ భిక్షువులు సందర్శించారు. బుద్ధ జయంతి రోజున నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, మహాయాన సిద్ధాంతకర్త, మాధ్యమిక, శూన్య వాదాలను స్థిరీకరించిన ఆచార్య నాగార్జునుడు తమకు అత్యంత గౌరవనీయుడని వారు చెప్పారు. కార్యక్రమంలో ఎఎస్ఐ కి చెందిన వెంకటేశ్వర్లు, బౌద్ధాభిమానులు గ్రంధి రామకృష్ణ, నాగార్జున పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/vps-2.jpg)