త్వరలో భవానీనగర్ రోడ్డు ప్రారంభం తిరుపతి టౌన్ : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం పక్కన భవానీనగర్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత శనివారం పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ప్రహరి గోడను ఆనుకొని భవానీనగర్ గుండా రైల్వే కాలనీ వైపుగా 500 మీటర్ల పొడవుతో వెలుతున్న కాలువను నూతనంగా నిర్మించడం జరిగిందని, దానిపై స్లాబ్ వేసి రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ రహదారి పూర్తి అయితే చుట్టు పక్కల చాలా ప్రాంతాలకు సౌకర్యవంతమైన రహదారిగా ఏర్పడుతుందన్నారు. మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ సహాన్ వున్నారు.
![త్వరలో భవానీనగర్ రోడ్డు ప్రారంభం](https://prajasakti.com/wp-content/uploads/2024/01/33333333333333333333333333333.jpg)