వృత్తిధర్మానికి వన్నెతెచ్చిన జన్నత్ హుస్సేన్ప్రజాశక్తి – సూళ్లూరుపేట: నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. వృత్తిధర్మానికి వన్నెతెచ్చిన గొప్ప వ్యక్తి జన్నత్ హుస్సేన్. గత కొన్ని రోజులుగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఉదయం సూళ్లూరుపేటలోని తన స్వగృహంలో మృతిచెందారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. జన్నత్ హుస్సేన్ 1977 ఐఎఎస్ బ్యాచ్. ఉమ్మడి ఏపీలో నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్రెడ్డిలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. 2010, డిసెంబర్ 31న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైర్ అయ్యారు.