శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభంప్రజాశక్తి – తిరుమలతిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, సిఇ నాగేశ్వరరావు, ఎస్‌ ఈ జగదీశ్వర్‌ రెడ్డి, విజిఓలు నంద కిషోర్‌, గిరిధర్‌ రావు, బాల్‌ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, పాల్గొన్నారు.

➡️