నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయ నిత్యాన్నదాన పథకానికి పట్టణానికి చెందిన ఒరుగు దయాసాగర్ రెడ్డి, మధుమతిరెడ్డి దంపతులు ఆదివారం లక్షా 11 వేలా ఒక్క రూపాయిని విరాళంగా అందజేశారు. నిత్య అన్నదాన పథకానికి ఖర్చు చేయాల్సిందిగా సూచించారు. దాత కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించారు. ఏఈఓ సతీష్ మల్లిక్, పిఆర్ఓ నాగభూషణం నాయక్, పీఆర్వో రవి, ఏపీ ఆర్ఓ గోపాల్ పార్థసారథి పాల్గొన్నారు.
![నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం](https://prajasakti.com/wp-content/uploads/2024/05/444444444444444444.jpg)