ప్రజాశక్తి పర్చూరు(బాపట్ల) : టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పర్చూరు నియోజకవర్గానికి చెందిన అడ్డగడ్డ వేణుగోపాలరావును టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు నియమించినట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు అందజేసినట్లు ఎమ్మెల్యే ఏలూరి ప్రకటించారు. న్యాయవాదిగా పని చేస్తూ, టిడిపిలో క్రియాశీలకంగా ఉన్న ఆయనను లీగల్ సెల్ కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.