సత్య కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 

Feb 21,2024 17:34 #Vizianagaram

ప్రజాశక్తి-తోటపాలెం  : స్ధానిక తోటపాలెం ఉన్లో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. మొదటిగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి మా తెలుగు తల్లి పాటను విద్యార్థులు ఆలపించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి మాట్లాడుతూ మన జీవితంలో మొదటగా నేర్చుకున్న భాష మాతృ భాష అని, తన తల్లిని ఎవరు చెప్పకుండా అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృ భాష కూడా అంతే, మాతృ భాష సహజంగా అబ్బుతుంది అని అప్రయత్నంగా వస్తుంది అని అమ్మ మాటే, మాతృ భాష అని అందుకే ప్రతి వారు అమ్మ ను కాపాడు కున్నట్లే మాతృ భాష ను కూడా కాపాడుకోవాలని, మనుగడ కోసం ఇతర భాష లను నేర్చుకోవడం లో తప్పు లేదు అయితే వాటి ప్రభావం మాతృ భాష పై పడకుండా చూసుకోవాలనీ, మాతృభాషను పరిరక్షించుకోవాలని, ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

➡️