ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎంకు ఓటు వేసి నగర అభివఅద్ధికి పాటుపడాలని యువజన రాష్ట్ర నాయకులు జి.రామన్న, నాయకులు యేసు, వర్మ, రాఘవేంద్ర, అబ్దుల్లా, రంగప్ప, గోవర్ధన్, హుస్సేన్, బిసన్నలు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్, సీపీఐ బలపరిచిన పాణ్యం సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశారు ని గెలిపించాలని కోరుతూ షరీన్ నగర్లో సోమవారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతోందని పాలకులు మాత్రం చిత్తశుద్ధితో పరిష్కారం చూపడం లేదన్నారు. నగరంలో అభివఅద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని దానికి వంత పాడుతున్న వైసిపి, టిడిపి పార్టీలను చిత్తుగా ఓడించి ప్రజల పక్షాన నిలబడిన సీపీఎంను ఆదరించాలని కోరారు.