సార్‌ని చూస్తే చాలనుకున్నాను..సాయి పల్లవి

Feb 7,2024 08:21 #movie, #sai pallavi

ప్రస్తుతం శివకార్తికేయన్‌ ‘ఎస్‌కే 21’లో కథానాయికగా నటిస్తున్నారు. ఆర్‌.మహేంద్రన్‌, వివేక్‌ కృష్ణానిలతో కలిసి కమల్‌హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కమల్‌ హాసన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘కమల్‌హాసన్‌ సార్‌ నా ఫేవరెట్‌ యాక్టర్‌. ‘మహానది’ సినిమా అంటే నాకు పిచ్చి. ఎన్నిసార్లు చూశానో లేక్కేలేదు. కమల్‌సార్‌ని చూస్తే చాలు అనుకునేదాన్ని. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్‌లో నటిస్తున్నాను. ఆయనతో ఇప్పటివరకూ నటించే అవకాశం రానందుకు బాధగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో కమల్‌సార్‌ని కలిశాను. ఆయన నవ్వుతూ పలకరించిన తీరు జీవితంలో మరిచిపోలేను. అదొక గుర్తుండిపోయే అనుభవం. ఇక ఈ చిత్రంలోని నా పాత్ర విషయానికొస్తే.. ప్రేయసిగా, భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా రకరకాల పార్శాలతో కూడుకున్న పాత్ర నాది. అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు దొరుకుతుంటాయి. తమిళంతోపాటు తెలుగులో కూడా ఓకేసారి ఈ సినిమా విడుదలవుతుంది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని చిత్ర విశేషాలపై కూడా సాయిపల్లవి ముచ్చటించారు. రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

➡️