సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్, చాందినీచౌదరి కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్ షాపు మూర్తి’. ఈనెల 31 థియేటర్లలో విడుదల కానుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. నిర్మాతలు ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. నిర్మాత హర్ష గారపాటి మాట్లాడుతూ ‘ఓ మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథను ఎంచుకున్నాం. బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మధ్యలో బడ్జెట్ పెరిగింది. కానీ ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే పూర్తి చేశాం. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’ అని అన్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లకు మంచి ఆదరణ వచ్చిందని పేర్కొన్నారు.