బెల్లంకొండ శ్రీను హీరోగా మూన్ షైన్ పిక్చర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. సుధీర్ బైరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ని కథానాయికగా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.50 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఏడాదిగా ఈ కథపై ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం నటీనటులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరుగుతోంది.