హరీష్ శంకర్- రవితేజ కాంబోలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్ర షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. రవితేజ ముఖంపై క్లాప్ బోర్డును చూపిస్తూ.. ‘ఇది ఇప్పుడే మొదలైంది’ అని రాసుకొచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/9-23.jpg)