మాస్ మహారాజా రవితేజ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రీయూనియన్గా వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ ఉత్తరప్రదేశ్లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ను ముగించుకుంది. కీలక షెడ్యూల్ని విజయవంతంగా పూర్తి చేయడంతో దర్శకుడు హరీష్ శంకర్ మరియు చిత్ర బృందం అయోధ్య ఆలయాన్ని సందర్శించింది. దర్శకుడు ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కలిగిఉన్న వీడియోను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మిగిలిన నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.