హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ హీరో సాయిధరమ్తేజ్ ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తుంటాడు. తాజాగా ఇద్దరు అనాథ చిన్నారులకు చికిత్స చేయించి తన పెద్దమనసు చాటుకున్నాడు. ఒక అనాథ శరణాలయం నుండి ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్కు సాయం కావాలంటూ సాయిధరమ్ తేజ్కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే తేజ్ ఆ చిన్నారులకు సాయం అందించాడు. ఈ విషయాన్ని టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7
— I.Andrew babu (@iandrewdop) February 22, 2024