నార్సింగి (హైదరాబాద్) : బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ‘త్రినయని’తోపాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్కు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన నిన్న మధ్యాహ్నం హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్డు నం.20లో ఉన్న అపార్టుమెంట్లోని తన ఫ్లాట్లో సీలింగ్ ఫ్యాన్కు డోర్ కర్టెన్తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి చాలాసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్కు వచ్చి చూసి.. చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మఅతుడి తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/actor.jpg)