విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం : 40 బోట్లు దగ్ధం

విశాఖ : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 40 బోట్లు దగ్ధమైన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. మొదట ఒక బోటులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మిగతా బోట్లకు వ్యాపించడంతో 40 బోట్లు పూర్తిగా కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే బోట్లకు నిప్పు పెట్టారని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో లక్షల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించిందని బోటు యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్కో బోటులో సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు తెలిపారు. సుమారు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️