- గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నడంతో ప్రమాదం
కౌలాలంపూర్: మలేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గాల్లో విన్యాసాలు చేస్తుండగా ఢీకొనడంతో 10 మంది సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటనపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మలేసియాలో ఈ శుక్రవారం (ఏప్రిల్ 26) రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఢీకొని కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
At least 10 people k1lled when two military helicopters collided midair in Lumut, #Malaysia. pic.twitter.com/gR45qrwjVZ
— Arthur Morgan (@ArthurM40330824) April 23, 2024