అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించారు.. అంటే 4 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటింగ్కు అవకాశం కల్పిస్తున్నారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది.. పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం చివరి గంటల్లో ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా ఫోకస్ పెట్టింది. చివరి రెండు గంటల్లో పోల్ వయొలెన్సుకు ఆస్కారం లేకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటుంది.. బూత్ క్యాప్చరింగ్, తగాదాలు జరగ్గకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.. తెనాలి, మాచర్ల, అనంతపురం సంఘటలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలకు బాధ్యలైన వారిని గఅహనిర్బంధం చేయాలని.. వారిపై కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తెనాలి ఎమ్మెల్యే సహా.. మాచర్ల, అనంతపురంలో హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశించింది. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశించిన విషయం విదితమే.