ద్రవ్యలోటు ఆందోళనకరం : కాంగ్రెస్

Feb 1,2024 15:17 #Congress, #Interim Budget

 న్యూఢిల్లీ :   ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని  కాంగ్రెస్  వ్యాఖ్యానించింది.  పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు స్పందించారు.     ‘అత్యంత ఆందోళన కలిగించే విషయం పెరుగుతున్న ద్రవ్య లోటు. ఎందుకంటే ఆర్థిక మంత్రి సమర్పించిన సంఖ్యలు ఈ సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో 18 లక్షల కోట్లకు పైగా నిధులు ఇవ్వని వాటిగా చూపిస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరుగనున్నది’ అని కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ పేర్కొన్నారు.

సాధారణంగా ప్రతి కార్యక్రమంలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించే రాజకీయ ప్రకటన మాదిరిగా మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగం ఉందని మరో కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ విమర్శించారు. సామాన్యులకు, రైతులకు, యువతకు ఎలాంటి ప్రయోజనం కలిగించ లేదన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సాధారణ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన నిధులు ఉండేలా చూసుకోవడానికి కేవలం పరిపాలనాపరమైన కసరత్తు మాత్రమే మధ్యంతర బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ ఎంపి కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు.

➡️