ఆసియాకప్‌ అండర్‌-19కు భారత జట్టు ఎంపిక

Nov 25,2023 22:20 #Sports

యూఈఏ వేదికగా 8నుంచి మెగా టోర్నీ

ముంబయి: యుఏఇ వేదికగా డిసెంబర్‌ 8నుంచి జరగనున్న అండర్‌-19 ఆసియాకప్‌లో ఆడే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) శనివారం ప్రకటించింది. యువజట్టులో ఇద్దరు హైదరాబాద్‌ ఆటగాళ్లకు చోటు దక్కింది. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి చెందిన ఆరవెల్లి అవనీశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌ కూడా జాతీయ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఇటీవల నిర్వహించిన చాలెంజర్‌ ట్రోఫీ ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. అవనీశ్‌ రావు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కాగా… మురుగన్‌ అభిషేక్‌ ఆల్‌ రౌండర్‌. వీరిద్దరూ నవంబరు 3 నుంచి 9 వరకు గువాహటిలో నిర్వహించిన అండర్‌-19 చాలెంజర్‌ ట్రోఫీలో సత్తా చాటారు. కాగా, 15 మందితో అండర్‌-19 భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు… ముగ్గురిని స్టాండ్‌ బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురు కూడా జట్టుతో పాటే ఉంటారు. వీరితో పాటు నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. భారత అండర్‌-19 జట్టుకు ఉదరు సహారన్‌(పంజాబ్‌) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. జట్టు: ఉదరు సహారన్‌(కెప్టెన్‌), సౌమీ కుమార్‌ పాండే(వైస్‌ కెప్టెన్‌), ఆరవెల్లి అవనీశ్‌ రావు (వికెట్‌ కీపర్‌), మురుగన్‌ అభిషేక్‌, నమన్‌ తివారీ, అర్షిన్‌ కులకర్ణి, రాజ్‌ లింబానీ, ఆదర్శ్‌ సింగ్‌, ఆరాధ్య శుక్లా, రుద్ర మయూర్‌ పటేల్‌, ధనుష్‌ గౌడ, సచిన్‌ దాస్‌, ఇన్నేశ్‌ మహాజన్‌(వికెట్‌ కీపర్‌), ప్రియాంశు మోలియా, ముషీర్‌ ఖాన్‌. స్టాండ్‌ బై: ఎండి అమన్‌, ప్రేమ్‌ దేవకర్‌, అన్ష్‌ గోసారురిజర్వ్‌ ఆటగాళ్లు: పి.విఘ్నేశ్‌, కిరణ్‌ చోర్మలే, దిగ్విజరు పాటిల్‌, జయంత్‌ గోయత్‌

➡️