క్వార్టర్స్‌కు సింధు

Mar 28,2024 22:28 #Sports

స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి పివి సింధు ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో సింధు వరుససెట్లలో చైనీస్‌ తైపీ షట్లర్‌ హంగ్‌ాయుాసన్‌ను చిత్తుచేసింది. కేవలం 36నిమిషాల్లో ముగిసిన ఈ పోటీల్లో సింధు 21-14, 21-13తో తైపీ ప్లేయర్‌ను ఓడించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు 12వ స్థానంలో ఉండగా.. హంగ్‌-యు-సన్‌ ర్యాంక్‌ 63. తొలి గేమ్‌లో తొలుత 3ా0పాయింట్లతో ఆధిక్యతలో నిలిచిన సింధు క్రమంలో 7-6పాయింట్లతో నిలిచింది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు క్వార్టర్‌ఫైనల్లో థారులాండ్‌కు చెందిన ఆరోసీడ్‌ సుపానిడా కాటెథాంగ్‌ లేదా జపాన్‌కు చెందిన నట్సుకి నిడైర్‌తో తలపడనుంది. ఆ తర్వాత 18-12పాయింట్లతో ఆధిక్యతలో నిలిచి ఆ గేమ్‌ను చేజిక్కించుకొంది. సింధు చివరిసారిగా 2022లో సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌500 టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఇక పురుషుల డబుల్స్‌లో 8వ సీడ్‌ అర్జున్‌ాధృవ్‌ కపిల జోడీ క్వార్టర్స్‌కు చేరారు. వీరు 21-17, 21-19తో స్కాట్లాండ్‌ జంటను చిత్తుచేశారు.

➡️