హరారే: భారత్తో స్వదేశంలో టి20 సిరీస్లో ఆడే జింబాబ్వే జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఆల్రౌండర్ సికిందర్ రజా సారథిగా 15మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. టీమిండియాతో ఐదు టి20ల సిరీస్ను జింబాబ్వే జట్టు ఆడనుంది. భారత్తో సిరీస్కు జింబాబ్వే సెలెక్టర్లు అనుభవజ్ఞులు, కుర్రాళ్లకు చాన్స్ ఇచ్చింది. ఇటీవల ఆ దేశ పౌరసత్వం పొందిన చిచ్చరపిడుగు అతుల్ నఖ్వీ తుది బృందంలో చోటు దక్కించుకున్నాడు. కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టిన జస్టిన్ సిమ్మన్స్కు ఈ సిరీస్ పెద్ద పరీక్ష కానుంది. టి20 ప్రపంచకప్కు అర్హత సాధించని జింబాబ్వే జట్టుకు ఈ సిరీస్ పెను సవాలుతో కూడుకున్నది. టి20ల్లో రికార్డు బ్రేకర్ అయిన రజాతో పాటు తెండారు చతర, వెస్లీ మధెవెరె, బ్రాండన్ మవుతా, వెల్లింగ్టన్ మసకజ్దలు ఆతిథ్య జట్టుకు కీలకం కానున్నారు. ఇరుజట్ల మధ్య జులై 6నుంచి ఐదు టి20ల సిరీస్ ప్రారంభం కానుంది.
జట్టు : సికిందర్ రజా(కెప్టెన్), ఫరాజ్, బ్రియాన్, కాంప్బెల్, చతర టెండారు, జాంగ్వే లుకె, కైయ ఇన్నోసెంట్, మడన్డే క్లైవ్, మధెవెరె వెస్లీ, తడివనషే, మసకజ్ద, బ్రాండన్, బ్లెస్సింగ్, డియాన్, నఖ్వీ, రిచర్డ్, మిల్టన్.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/zim.jpg)