ఛెంగ్డు(చైనా) : థామస్, ఉబెర్ కప్లో భారత జట్లు పరాజయాన్ని చవిచూసాయి. గురువారం జరిగిన థామస్కప్ క్వార్టర్ఫైనల్లో భారత పురుషుల జట్టు 3-1తదో చైనా చేతిలో ఓటమిపాలవ్వగా.. ఉబెర్ కప్లో మహిళల జట్టు 3-0తో జపాన్ చేతిలో చిత్తుగా ఓడింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పురుషుల జట్టు రెండో సింగిల్స్లో లక్ష్యసేన్ 13-21, 21-8, 21-14తో లీ-షి-ఫెంగ్ను చిత్తుచేసి భారత్కు 1-2 ఆధిక్యతలో నిలిచాడు. తొలి సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణరు 21-15, 11-21, 14-21తో హోరాహోరీ పోరులో షి-యు-కి చేతిలో ఓడాడు. ఇక టాప్సీడ్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ జంట 15-21, 21-11, 12-21తో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో స్కోర్ 1-1తో సమమైంది. రెండో పురుషుల డబుల్స్లో ధృవ్ కపిల-సాయి ప్రతీక్ జంట 10-21, 10-21తో చైనా ఝట్లర్ల చేతిలో ఓటమితో భారత్ ఓటమి ఖాయమైంది.
ఉబెర్కప్లోనూ నిరాశే..
ఉబెర్ కప్లో మహిళల జట్టుకూ నిరాశ తప్పలేదు. తొలి సింగిల్స్లో అస్మిత చాలీహా 10-21, 22-20, 15-21తో ఒహోరీ చేతిలో ఓటమిపాలైంది. డబుల్స్లో ప్రియ-మిశ్రా జోడీ 8-21, 9-21తో, రెండో సింగిల్స్లో ఇషారాణి 15-21, 12-21తో మహిళల జట్టు ఓటమిపాలైంది.