ముంబై : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో భారత మహిళా జట్టు ఘన విజయాన్ని సాధించింది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్.. 428 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ కేవలం 136 పరుగులకు పరిమితమైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 479 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్కు దిగింది. మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు మళ్లీ 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత మహిళా జట్టు 347 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎! 🏆
Congratulations to the @ImHarmanpreet-led unit on a fantastic win 👏#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/PYklZpQFzP
— BCCI Women (@BCCIWomen) December 16, 2023