- వెస్ట్ బ్యాంక్పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్
గాజా: ఇజ్రాయిల్ దళాలు క్రిస్మస్ రోజు కూడా గాజా, వెస్ట్ బ్యాంక్లపై హంతక దాడులు కొనసాగించింది. వెస్ట్బ్యాంక్ లోని పెంట్రల్ రీజియన్ ప్రధాన రహదారులపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. అంబులెన్సులు, పౌర వాహనాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు వేయడంతో పౌరులు ఎక్కువ మంది చనిపోయారు. సెంట్రల్ గాజాలోని అల్- మఘాజీ శరణార్థి శిబిరంపై ఆదివారం జరిపిన దాడిలో 70 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇంకా అనేక మంది గాయపడ్డారు. గాజా దక్షిణ ప్రాంతంలోని యూసిస్పై కూడా దాడి జరిగింది. ఈ దాడులతో క్రిస్మస్ రోజున కూడా గాజా నెత్తురోడింది. అంబులెన్సులు, సహాయక బృందాల పనికి తీవ్ర విఘాతం ఏర్పడింది. అక్టోబరు 7 నుండి ఇజ్రాయిల్ జరుపుతున్న హంతక దాడుల్లో ఇంతవరకు 54, 036 మంది చనిపోయారు. మరో 20, 424 మంది గాయపడ్డారు. వీధుల్లో శిథిలాలను తొలగించడానికి, పౌరుల ఇళ్లను కూల్చివేయడానికి ఇజ్రాయిల్ ఆర్మీ బుల్డోజర్లను ఉపయోగించింది. బెత్లహాం, బీటా, నబ్లస్, హెబ్రోన్ సమీపంలోని సైర్, కర్మ, ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ ఆర్మీ భీకర దాడులకు పాల్పడుతున్నది.