Earthquake : 5.5 తీవ్రతతో పాకిస్తాన్‌లో భూకంపం

Mar 20,2024 16:13 #Earthquake, #Pakistan

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం 2.57 గంటల సమయంలో పాకిస్తాన్‌లో భూప్రకంపనలు సంభవించాయి. వెడల్పు : 29.74, పొడవు 65.93, 105 కిలోమీటర్ల లోతులో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఈ ఏడాది వరుస భూకంపాలు పాకిస్తాన్‌ను వణికిస్తున్నాయి. గత నెలలో 4.7 తీవ్రతతో పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఇక జనవరిలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

➡️