నమీబియా : నమీబియా అధ్యక్షుడు హేగే గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున విండ్హోక్లోని ఆసుపత్రిలో మరణించినట్లు అధ్యక్ష కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ఒక ప్రకటనలో తెలిపింది. “నమీబియా రిపబ్లిక్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ హేజ్ జి. గింగోబ్ ఈరోజు, 4 ఫిబ్రవరి 2024 ఆదివారం నాడు దాదాపు గం.4 గంటలకు లేడీ పోహాంబా హాస్పిటల్లో వైద్యం పొందుతూ మరణించారని తెలియజేస్తున్నాను.” అని పోస్ట్ లో పేర్కొంది. తాత్కాలిక అధ్యక్షుడు నాంగోలో ఎమ్బుంబా వ్యవహరించనున్నారు.