- 8 మంది దుర్మరణం
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. పౌర నివాసాలే లక్ష్యంగా పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడిందని ఆఫ్ఘనిస్థాన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. పాకిస్థాన్ వైమానిక దాడుల్లో పక్తికా ప్రావిన్స్లోని ఆరుగురు దుర్మరణం పాలయ్యారని చెప్పారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారని ముజాహిద్ తెలిపారు. ఖోస్ట్ ప్రావిన్స్లో పాకిస్థాన్ వైమానిక దాడులతో కుప్పకూలిన భవన శిథిలాల కింద చిక్కుకుని మరో ఇద్దరు మహిళలు మరణించారని చెప్పారు. ఈ దాడులను ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఆదివారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ వైమానిక దాడులు జరిగాయి. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ టెర్రరిస్టుల దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ఈ దాడులకు పాల్పడింది.