చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్..!

May 9,2024 13:30 #America, #Missing

చికాగోలో భారత విద్యార్థి అదశ్యం అయ్యాడు. మే 2 నుంచి తెలంగాణకు చెందిన విద్యార్థి చింత కింది రూపేశ్‌ చంద్ర మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. రూపేష్‌ చికాగోలోని ఎన్‌ షెరిడాన్‌ రోడ్‌ 4300 బ్లాక్‌ నుంచి కనపడకుడా పోయినట్లు తెలిపారు.
కాగా తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్‌ విస్కాన్సిన్‌ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు. రూపేశ్‌ మిస్సయిన విషయం తెలియడంతో అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కొడుకు ఆచూకి కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరారు.

➡️