చిక్బల్లాపూర్ (కర్నాటక) : కారు అదుపు తప్పి చెరువులోపడటంతో నలుగురు కళాశాల విద్యార్థులు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిక్బల్లాపూర్ వద్ద ఆదివారం జరిగింది. చిక్బల్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను బెంగళూరు రేవా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/accident-02.jpg)