- సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ అఫిడవిట్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఇడిని సమాధానం కోరింది. తాజాగా ఇడి దాఖలు చేసిన అఫిడవిట్పై కేజ్రీవాల్ రిజయిండర్ దాఖలు చేశారు. ఇడిని కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందనడానికి తన అరెస్టే నిదర్శన మని తాజా అఫిడవిట్లో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలకు సమాన పోరాట స్థాయి కల్పించాలన్న ఆయన.. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే తనను అరెస్టు చేసిన తీరు ఇడి ఏకపక్ష వైఖరిని తెలియజేస్తుందన్నారు.