ఘాజీపూర్ : బందా జైల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ గురువారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. బందా జిల్లాలోని రాణి దుర్గావతి మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత అన్సారీ మృతదేహాన్ని పోలీసులు అతని స్వస్థలమైన ఘాజీపూర్కు తరలించారు. శనివారం ఘాజీపూర్లో మొహమ్మదాబాద్ కాలీబాగ్లోని స్మశానవాటికలో అన్సారీ అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో యుపి ప్రభుత్వం ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. అన్సారీ మృతదేహాన్ని తీసుకెళ్లే అంబులెన్స్తోపాటు 24 పోలీసు వాహనాలు కూడా వెళ్లాయి. ఘాజీపూర్తోపాటు పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రతల నడుమ అన్సారీ అంత్యక్రియలు జరగనున్నాయి.