కరోనా ఉధృతి .. ఒక్కరోజులో 702 కొత్త కేసులు

Dec 28,2023 13:14 #COVID-19, #India

న్యూఢిల్లీ :    భారత్‌లో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 702 కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం 8 గంటలకు అప్‌డేట్‌ చేసిన నివేదికలో పేర్కొంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,097కి పెరిగాయి. 24 గంటల వ్యవధిలో ఆరు కొత్త మరణాలు నమోదవగా, మహారాష్ట్ర నుండి ఇద్దరు, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు తెలిపింది.

డిసెంబర్‌ 5 వరకు కేసులు రెండంకెలకు పడిపోయాయని, అయితే కొత్త వేరియంట్‌ , చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపింది. డిసెంబర్‌ 22న దేశంలో 752 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 మహమ్మారి ప్రారంభంలో రోజువారీ కేసులు లక్షల్లో గరిష్టస్థాయికి చేరుకున్నాయి. 4.5కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా సుమారు నాలుగేళ్లలో 5.3 లక్షల మంది మరణించారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లను దాటింది.

➡️