Jharkhand : పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి

Nov 18,2023 16:09 #Jharkhand, #road accident

 

గిరిదిహ్ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢకొీనడంతో.. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున గిరిదిహ్ జిల్లాలోని బాగ్మారా గ్రామం సమీపంలో జరిగింది. బాధితులంతా థోరియా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మొత్తం పదిమంది శుక్రవారం తికోడిహ్ ప్రాంతంలో పెళ్లికి హాజరై.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కారు అదుపు తప్పి చెట్టును ఢకొీట్టింది. కారు నడుపుతున్న డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు పేర్కొన్నారు.

➡️