న్యూఢిల్లీ : తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురువు రామ్దేవ్ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణలు సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపారు. ధిక్కార పిటిషన్పై స్పందించకపోవడంపై పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు రెండు రోజుల క్రిత ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారు ఏప్రిల్ 2న కోర్టుకు హాజరుకావాలని జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో పతంజలి సంస్థ బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.