ఢిల్లీ : గుజరాత్, ఢిల్లీలలో శనివారం జరిగిన అగ్నిప్రమాదాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ”గుజరాత్లోని రాజ్కోట్లోని ఓ మాల్లోని గేమింగ్ జోన్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో అమాయక చిన్నారులు సహా పలువురు మరణించిన వార్త చాలా బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. సహాయ, సహాయ కార్యక్రమాల్లో పరిపాలనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను అభ్యర్థించారు. గుగుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ సంఘటనలపై సమగ్రమైన, నిష్పాక్షిక దర్యాప్తును నిర్వహించి, మృతుల కుటుంబాలందరికీ సత్వర న్యాయం చేయాలని భావిస్తున్నాను.”అని పేర్కొన్నారు.
గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమింగ్ జోన్లో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. అదే విధగా శనివారం అర్ధరాత్రి ఢిల్లీలోని వివేక్ విహార్ న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు చనిపోయారు.
राजकोट, गुजरात में एक मॉल के गेमिंग ज़ोन में लगी भयंकर आग से मासूम बच्चों समेत कई लोगों की मृत्यु का समाचार बहुत ही पीड़ादायक है।
सभी शोकाकुल परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। सभी घायलों के जल्द से जल्द स्वस्थ होने की आशा करता हूं।
कांग्रेस कार्यकर्ताओं से अनुरोध…
— Rahul Gandhi (@RahulGandhi) May 25, 2024