- హైకోర్టుకు రిఫర్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మార్గదర్శిపై విచారణను కొట్టేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకు మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. ఎపిలో కూడా డిపాజిటర్లు ఉన్నారు. కాబట్టే అనుమతినిచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు, మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్బిఐ కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. ఉండవల్లి అరుణకుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి. తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు, ఆర్బిఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి. ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించండి’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.