న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకుగాను 10 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సిఎం పెమా ఖండూ ఒక్కరే ముక్తో నుంచి పోటీ చేయడంతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీ అయిన ఈ నెల 30 వరకూ ఆయా నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు.
అరుణాచల్లో 10 స్థానాల్లో బిజెపికి ఏకగ్రీవం : 50 స్థానాల్లోనే పోటీ
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/bjp-flags.jpg)