విజయన్‌, ఆయన కుమార్తెపై విచారణకు తిరస్కృతి

May 7,2024 00:28 #kerala, #Pinarayi Vijayan

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆయన కుమార్తె టి.వీణలపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విజిలెన్స్‌ కోర్టు కొట్టివేసింది. లాజిక్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించి తాను చేసిన ఆరోపణలపై విజిలెన్స్‌ కోర్టు ప్రత్యక్ష విచారణ జరపాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుజల్నాదన్‌, ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. విజయన్‌ ప్రభుత్వంపై బురదచల్లేందుకు దీనిని ఒక అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్‌ చూసింది. ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కుజల్నాదన్‌ అవసరమైన ఆధారాలు చూపలేకపోవడంతో విజిలెన్స్‌ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఏ ఆధారాలు లేకుండా ఎలా కోర్టుకు వచ్చారని ప్రశ్నిస్తే ఆయన బిక్కమొగం వేశారు.

➡️