ఈ నెల 16 న ఏపీలో సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభ

అమరావతి : ఏపీలో సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభకు ముహుర్తం ఫిక్స్‌ ఖరారు అయింది. మొదట తిరుపతిలో సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభ ఉంటుందని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటుందనిఏపీ కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ నెల 15 న విశాఖపట్నం ఏపీసీసీ బహిరంగ సభ వాయిదా పడింది. అయితే ఈ నెల 16 న సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని ఏపీ కాంగ్రెస్‌ ప్రకటన చేసింది. ఈ బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గననున్నారు. ఈ కాంగ్రెస్‌ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, జాతీయ నేతలు కూడా హాజరు అవుతారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో ను రిలీజ్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

➡️