కరీంనగర్ : కరీంనగర్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ప్రతిమ హౌటల్లో తనిఖీలు చేపట్టి రూ.6.65 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేవని చెప్పారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/1-37.jpg)