ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. తునిలోని సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర వేడుకలలో యనమల రాజేష్, యనమల కృష్ణుడు వర్గాలు ఘర్షణకు దిగాయి. యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్తున్న రాజేష్ వర్గాన్ని కృష్ణుడు వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అది కాస్తా చెలరేగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.